
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో 7 అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. భైంసా మండలంలోని సుంక్లి, కుభీర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్–1, కుంటాల మండలంలోని లింబా(కె), లోకేశ్వరం మండలంలోని రాజురాతోపాటు తానూర్, బాసర, ముథోల్ మండల కేంద్రాల్లోని సెంటర్లకు భవనాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఒక్కో భవనానికి రూ.12లక్షలు కేటాయించారని తెలిపారు.